తెలంగాణ మున్నూరుకాపు మరియు విశ్రాంత ఉద్యోగుల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను మేడ్చల్ జిల్లాలోని నిమ్మల కన్వెన్షన్ లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాయింట్ కలెక్టర్, Tspsc మాజీ సభ్యులు కోట్ల అరుణకుమారిపటేల్, నాగర్ కర్నూల్ జిల్లా వైద్యకళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శృతి పటేల్, గంధం వసుంధర పటేల్ (ACP, assistant city planner) నారా దీప్తి పటేల్ హైకోర్టు అడ్వకేట్, ప్రముఖ గాయని రేలరా గంగా, స్వాతి పాల్గొని మహిళా ఉద్యోగులను అవార్డులతో సత్కరించడం జరిగింది. ఈ సంధర్భంగా వచ్చిన అతిధులు మహిళలు ఇంటి భవిష్యత్ తో పాటు దేశ భవిష్యత్ లో కూడా భాగం అవుతున్నారని అన్నారు. మహిళలు ఉద్యోగరంగంలోనే కాకుండా వ్యాపార రంగంలో కూడా రాణించాలి అని అన్నారు. ఈ కార్యక్రమాన్ని నేతి మంగమ్మ పటేల్, తోకల సుధారాణి ముందుండి నడిపించారు. సన్మాన గ్రహీతలు కార్యక్రమం చివరన ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాల శ్రీనివాస్ పటేల్, గౌరవ అధ్యక్షుడు ఏనుగుల సత్యనారాయణ పటేల్, ప్రధానకార్యదర్శి ఇట్యాల వెంకటకిషన్ పటేల్, మామిడి రమేష్ పటేల్ ను సత్కరించడం జరిగింది.
తెలంగాణ మున్నూరుకాపు మరియు విశ్రాంత ఉద్యోగుల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
Date: