Home రాజకీయాలు బిజెపి పార్టీ తీర్థం పుచ్చుకున్న మెండోరా ఎంపిటిసి ఆరే లావణ్య రవీందర్- కమలం కండువా కప్పి...

బిజెపి పార్టీ తీర్థం పుచ్చుకున్న మెండోరా ఎంపిటిసి ఆరే లావణ్య రవీందర్- కమలం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ

ఇందూరు, ఫిబ్రవరి27

భారత ప్రధాని నరేంద్ర మోడీ పాలనకు ఆకర్షితులై మంగళవారం నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం మెండోరా గ్రామానికి చెందిన యంపీటీసీ ఆరే లావణ్య రవీందర్ తో పాటు పలువురు బీఆర్ యస్ పార్టీ నాయకులు బిజెపి పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మంగళవారం భింగల్ పట్టణంలో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప యాత్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, అర్బన్ ఎమ్మెల్యే దనపల్ సూర్యనారాయణ, జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి, బాల్కొండ ఇంచార్జ్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి సమక్షంలో మెండోరా ఎంపిటిసి ఆరే లావణ్య రవీందర్ కు కమలం కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఆరే లావణ్య రవీందర్ తో పాటు, పలువురు బీఆర్ యస్ పార్టీ నాయకులు సైతం బిజెపి కండువా కప్పుకున్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా ధర్మపురి అరవింద్ ను భారీ మెజారిటీతో గెలుపించుకుంటామని వారు అన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version