Home రాజకీయాలు ఇందూర్ ఎంపీ ఆర్వింద్ ధర్మపురిని కలిసి ధన్యవాదాలు తెలిపిన BJYM రాష్ట్ర ఉపాధ్యక్షులు నాయకుడు.సంతోష్ కుమార్

ఇందూర్ ఎంపీ ఆర్వింద్ ధర్మపురిని కలిసి ధన్యవాదాలు తెలిపిన BJYM రాష్ట్ర ఉపాధ్యక్షులు నాయకుడు.సంతోష్ కుమార్

ఇటీవలే ప్రకటించిన BJYM కమిటీలో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమింపబడిన నాయకుడు సంతోష్ కుమార్ నిజామాబాద్ ఎంపి ఆర్వింద్ ధర్మపురి కలిశారు. రాష్ట్ర స్థాయి పదవీ బాధ్యతలు ఇప్పించినందుకు ప్రత్యేకంగా ఆశీర్వాదం తీసుకున్నారు. మరోసారి నిజామాబాద్ లో బీజేపీ జెండా ఎగరేసేందుకు ఎంపీ గారి వెన్నంటి ఉంటానని తెలిపారు. ఎంపీ గారి కార్యాలయం లో కలిసి ఎంపీ గారికి శాలువా తో ఘనంగా సన్మానించారు. ఎంపీ గారి తోడ్పాటు వల్లే పదవి సాధ్యమైందన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్ష బాధ్యత రావడానికి సహకరించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, రాష్ట్ర నాయకులు మల్లికార్జున్ రెడ్డి, BJYM రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్ గార్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version