అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకుని సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల లక్కోర లోమహిళా రైతులు పాడిద లక్మి,మీసాల మాధవి గార్లకీ సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ అధ్యక్షుడు రవీందర్ ర్యాడ గారి చేత మహిళా దినోత్సవ మొమెంటో తో పాటు శాలువా కప్పి టీం సభ్యులు సన్మానించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ఉపాధ్యాయులు చాదల్ నర్సింగ్ రావు, మీసాల రాజేంద్ర ప్రసాద్, చాదల్ రాజేందర్,పోశెట్టి,
సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ సంస్థ సభ్యులు ఆర్మూర్ శ్రీనివాస్,దాసరి శ్రీకాంత్,మనోజ్ రాజ్, దాసరి రవి తేజ,దాసరి రవిందర్, భూమేష్,మీసాల గంగాధర్ మొదలగు వారు పాల్గొన్నారు.
రవిందర్ ర్యాడ మాట్లాడుతూ రైతుల భర్తలు చనిపోవడంతో కష్టపడి వ్యవసాయం చేస్తూ
కుటుంభ పోషణ చేస్తున్నందుకు ఈ గౌరవ సన్మానం చేస్తున్నామని,ఈ రైతమ్మలను చూసి భవిష్యత్తులో ఎంతో మంది స్ఫూర్తి పొంది లాభసాటి వ్యవసాయాన్ని చేయాలని కోరారు.