ఈరోజు బజార్ హత్నూర్ మండలంలోని దేగామ గ్రామంలో స్థానిక జిల్లాపరిషత్ సెకండరీ పాఠశాల ప్రాంగణంలో ఆ గ్రామ పాఠశాల విద్యార్థిని&విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకై కరోన కష్టకాలంలో ఆన్లైన్ తరగతుల నిర్వహణ జరుగుతున్న నేపథ్యంలో స్థానిక జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థుల సౌకర్యార్థం స్మార్ట్ ఫోన్లు&స్మార్ట్ టి.వి.లు గృహాలలో లేక ఇబ్బంది పడుతున్న విద్యార్థుల కోసం వారి చదువులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మరియు ఆ పాఠశాలలో చదువుతున్న ఇతర విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు,ఇతర విధ్యాకార్యక్రమాలకు సంబందించిన తరగతులను భోదించడానికి సరికొత్థగా వినూత్న రీతిలో మారుమూల మండలం అయిన బజార్ హత్నూర్ మండలంలోని దేగామ గ్రామ పంచాయితీ పరిధిలో గల దేగామ గ్రామంలోని జడ్.పి.ఎస్.ఎస్.లో ఎల్ఈడీ స్మార్ట్ టి.వి.(40ఇంచులు)ని స్థానిక సర్పంచ్ దుర్వ లక్ష్మణ్,పాఠశాల విద్యాకమిటి చైర్మన్ నాయిడి మహేష్ గార్ల ఆధ్వర్యంలో మన తుల సుభాష్ వెల్ఫేర్ సొసైటీ చైర్మన్ తుల అరుణ్ కుమార్ గారు మరియు గ్రామీణ సపోర్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కడారి నరేష్ గారు సంయుక్తంగా వీరు బహుకరించారు.. కార్యక్రమంలో భాగంగా మండల ఎం.పి.పి.అజడే జయశ్రీ కేవల్ సింగ్ స్థానిక గ్రామ ఉప సర్పంచ్ మడిగే అశోక్,మండల పి.ఏ. సి.ఎస్.చైర్మన్ మేకల వెంకన్న,స్థానిక గ్రామ టి.ర్.స్.పార్టీ అధ్యక్షులు బొడ్డు బోజన్న,యువసేన యూత్ అధ్యక్షులు నరేష్,స్థానిక గ్రామ పంచాయితీ వార్డు సభ్యులు ఊశన్న,బి.జె.పి.మండల సోషల్ మీడియా నాయకులు గాజుల రాకేష్,మాజీ ఎస్.ఎం.సి.చైర్మన్ పోరెడ్డి రాజేందర్ గ్రామస్థులు భూమన్న,ప్రవీణ్ ,రాజేశ్వర్, రవి తదితరులు పాల్గొన్నారు..
