
Minister of State for Home Affairs, Govt. of India
ప్రధాని నరేంద్రమోదీ గారి ఆలోచనలకు అనుగుణంగా 5 ట్రిలియన్ డాలర్ల భారీ ఆర్థిక వ్యవస్థను, ఆత్మనిర్భర్ భారత్ను నిర్మించే దిశగా ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంటులో ఆత్మనిర్భర భారత్ బడ్జెట్ను ప్రవేశపెట్టారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. “సృజనాత్మకత, సామర్ధ్యo, నాయకత్వం, మానవ వనరులు, సమాచార సాంకేతిక పరిజ్ఞానం, ఆర్థిక వనరులు వంటి 6 అంశాల ఆధారంగా ఆరోగ్యం, సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ కొత్త బడ్జెట్లో ‘ప్రధానమంత్రి ఆత్మనిర్భర స్వాస్థ భారత్’ ని ఆర్ధిక మంత్రి బడ్జెట్-2021 లో ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు.
కోవిడ్ 19 మహమ్మారి నుండి ప్రతి భారతీయుడిని కాపాడే లక్ష్యంతో, ఈ బడ్జెట్లో కొవిడ్ వాక్సిన్ కోసం ₹35,400 కోట్లు కేటాయించి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని తమ ప్రభుత్వ తొలి ప్రాధాన్యం ప్రజల ఆరోగ్యమేనని ఆర్ధిక మంత్రి స్పష్టం చేశారని, కిషన్ రెడ్డి అన్నారు. ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ గారు బడ్జెట్ లో కొత్తగా ప్రతిపాదించిన మెగా టెక్స్ టైల్ పార్క్ పథకం వల్ల ఉపాధి అవకాశాలు మెరుగుపడి, భారత్ వస్త్ర ఎగుమతుల కేంద్రంగా మారుతుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దీని కింద మూడు సంవత్సరాల కాలంలో 7 పార్కులు ఏర్పాటు చేయటం సంతోషకరమని కిషన్ రెడ్డి తెలిపారు.